తల్లిపాలు తీసుకోవడం ద్వారా బిడ్డ మరింత ఆరోగ్యంగా ఉంటుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలో జరిగిన తల్లిపాలు వారోత్సవాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆ బిడ్డలకు తల్లులకు కావలసిన పౌష్టికాహారాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు