పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టి అన్నవరం గ్రామంలో గుడిలో నిర్వహించే కొలుపుల కార్యక్రమం కోసం చందాల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.