సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మధుసూదన్ రావు,రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్, ఏడి సర్వేయర్ భరత్ కుమార్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ..ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో నిశితంగా అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలోగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు