తుగ్గలి మండలంలో నాటుసారా తయారీ, విక్రయాలపై కఠినచర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్రామకృష్ణారెడ్డి, ఎస్సై మల్లికార్జున హెచ్చరించారు. శుక్రవారంఎక్సైజ్, జొన్నగిరి పోలీసులు సంయుక్తంగా రోళ్లపాడు తండాలోదాడులు నిర్వహించారు. ఈ దాడిలో వంద లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసి ఐదు లీటర్ల నాటుసారా, 50 కేజీలబెల్లాన్ని సీజ్ చేశారు. వెంకటనాయక్ పై కేసు నమోదైంది.