రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సెప్టెంబర్ 2 వతేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం తెల్సిన వివరాల మేరకు కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చింతకొమ్మదిన్నె జమాలపల్లి గ్రామంలో సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం తరగతి గదుల సందర్శన ఉంటుందన్నారు. అనంతరం పెండ్లిమర్రిలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం కొప్పర్తిలో ఇండస్ట్రియల్ హబ్ లో ఎగ్జిక్యూటివ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.తదుపరి టెక్నోడోమ్ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్,టెక్సానా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ప్రారంభిస్తారు.