శ్రీ సత్య సాయి జిల్లా కనగానపల్లి సమీపాన సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ద్విచక్ర వాహనంలో ఢీకొన్న కారు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న కళ్యాణ్ దుర్గం మండలం బాల వెంకటాపురం గ్రామానికి చెందిన ముత్యాలప్ప అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అవడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. తగరకుంట నుండి బాల వెంకటాపురం కు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కనగానపల్లి సమీపనే ప్రమాదం జరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.