ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగురామన్న చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని ఆరోపించారు.