వికారాబాద్ జిల్లా ధరూర్ మండల కేంద్రం నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఓ గోతిపడడంతో గత రాత్రి ఇద్దరు యువకులు కింద పడి తీవ్ర గాయాలయ్యాయని, ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకముందే రోడ్డును బాగు చేయాలని స్థానికులు శనివారం ఉదయం కోరారు. అప్పటివరకు తాత్కాలికంగా ఆ రోడ్డును పక్కనే ఉన్న మట్టి రాళ్లతో నింపేసి మానవత్వం చాటుకున్నారు.