16 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన వ్యక్తులపై తక్షణమే శిక్షించాలని గోకవరం మండలం కృష్ణునిపాలెం రోడ్డులో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి డీ ఎస్ యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కే సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా,ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలు ఆగడం లేదని,ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే అని ఆయనే విమర్శించారు.