తొట్టంబేడులో పూర్తైనా గణేష్ నిమజ్జనం వినాయక చవితి సందర్భంగా తొట్టంబేడు మండలం మరియు శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాలలోని వినాయక విగ్రహాలను పెద్ద కన్నలి గ్రామం వద్ద తెలుగు గంగ కాలువలో నిమజ్జనం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి సీసీ కెమెరాలు, ఎస్ఈడీ లైట్లను అమర్చారు. దీంతో పకడ్బందీగా టూ టౌన్ సిబ్బంది ఆధ్వర్యంలో కమిటీ నిర్వాహకులు గణపతులు నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.