నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ మురళీకృష్ణ ఆలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు కలెక్టర్ కు సాధార స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు,ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఉత్సవాలలో సామరస్యంగా వ్యవహరించాలని సూచించారు.