రామచంద్రపురం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మోడరన్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. జేఏసీ కన్వీనర్ మగాపు అమ్మిరాజు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.