Download Now Banner

This browser does not support the video element.

ఖానాపూర్: కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఉధృతి, ఒక్క గేటెత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు

Khanapur, Nirmal | Sep 3, 2025
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుందని బుదవారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 11032 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు ఒక్క గేట్ ఎత్తి అవుట్ ప్లోగా 10640 క్యూసెక్కుల నీటిని దిగవనున్న గోదావరిలోకి అధికారులు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 4.699 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 695.700 అడుగులు 3.669 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us