విశాఖ జిల్లా ఆనందపురం నుంచి అనకాపల్లి జాతీయ రహదారి గండిగుండం వద్ద సోమవారం అదుపుతప్పి మినీ వ్యాన్ బోల్తాపడింది. రాజమండ్రి నుండి నర్సరీ మొక్కల లోడుతో విజయనగరం వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ గాయపడగా గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఆనందపురం పోలీసులు ఈ ఘటన పై వివరాలు సేకరిస్తున్నారు.