పాతబస్తీలోని సంతోష్ నగర్ డివిజన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం పార్టీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉచితంగా పరీక్షలతో పాటు కళ్లద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఉచిత శిబిరాలు ప్రజల కోసమేనని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.