మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో ఛార్జ్ షీట్ నమోదయ్యేంతవరకు నెల్లూరు జిల్లాకు రావద్దంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి కాకాని లాయర్లు తెలిపారు. దీంతో ఆయన నెల్లూరు జిల్లా కి వచ్చేందుకు మార్గం సుముగమైంది. శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారు.