ఆదోని పట్టణ శివారులో పేకాట శిబిరంపై మూడో పట్టణ పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో పేకాట ఆడుతున్న ఐదుగురుని అదుపులోకి తీసుకున్నామని సీఐ రామలింగయ్య తెలిపారు. వారి వద్ద నుంచి రూ.25 వేలు నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామన్నారు.