Download Now Banner

This browser does not support the video element.

జహీరాబాద్: లింగంపల్లి గురుకుల కళాశాలను సందర్శించిన కలెక్టర్ ప్రావిణ్య

Zahirabad, Sangareddy | Sep 12, 2025
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గురుకుల పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఇటీవల పాఠశాలలో కూలిన డార్మెంటరీ భవనం శిథిలాల తొలగింపు ప్రక్రియను శుక్రవారం అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా శిథిలాల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గురుకుల పాఠశాల నూతన హాస్టల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల తాత్కాలిక వసతికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us