Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: అందరూ బాగా కష్టపడి చదవాలి: కళ్యాణదుర్గం ప్రభుత్వ పాఠశాలలో జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ

Kalyandurg, Anantapur | Sep 2, 2025
విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అనంతపురం జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠాలను ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉందని అడిగారు. తాగునీటి సదుపాయం, టాయిలెట్లు, బాత్రూములు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాలపైన ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా కష్టపడి చదవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us