ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలం లోని పొన్నారి గ్రామానికి చెందిన గుమ్ముల నరేష్ అనే యువకుడు మద్యం మత్తులో మంగళవారం గ్రామ శివారులో రైలుకింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అయితే నరేష్ సూసైడ్ చేసుకున్నాడా, లేదా ప్రమదావశాత్తు ఈ ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. కాగా విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.