సంజామల మండలం కానాలలో మూడో శనివారం సందర్భంగా ఎంపీడీవో రామసుబ్బయ్య ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.ZPHS విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం ద్వారా ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని ఎంపీడీవో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటనారాయణ, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.