Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: కోస్గి మద్దూర్ మండల కేంద్రాలలో గణేష్ శోభాయాత్ర నిర్వహించే రూట్ మార్గాన్ని పరిశీలించిన ఎస్పీ యోగేష్ గౌతమ్

Narayanpet, Narayanpet | Sep 1, 2025
నారాయణపేట జిల్లా కోస్గి మద్దూర్ మండల కేంద్రాల లోని గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయక విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే రూట్ మార్గం ను నారాయణపేట ఎస్పి యోగేష్ గౌతమ్ సోమవారం 11 గంటల సమయంలో పరిశీలించారు. ముందుగా కోస్గి లోని మున్నూరు వాడ, బహార్ పేట లోని వినాయక విగ్రహాలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మద్దూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ బాల గణేష్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఘన విగ్రహాన్ని ఎస్పీ దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us