టెక్కలి, నందిగం మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు అధికారులు తమకిచ్చిన మొబైల్ ఫోన్లను సోమవారం టెక్కలి ప్రాజెక్ట్ కార్యాలయంలో పెట్టేశారు. కేంద్రాల నిర్వహణకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయకపోవడంతో పాటు ఎస్ఆర్ఎస్, ఫోటో క్యాప్చర్, నెట్ వర్క్ సమస్యలు నెలకొందని తెలిపారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు టెక్కలి ప్రాజెక్ట్ కార్యకర్తలు సెక్టార్ల వారీగా మొబైల్ ఫోన్లను బాక్సుల్లో పెట్టి ఇచ్చేశారు.