ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి పై బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడంతో సాయంత్రం ఐదు గంటల సమయంలో బసవేశ్వర చౌరస్తా వద్ద బిజెపి నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దాహనం చేశారు.