కోడుమూరు మండలంలోని వెంకటగిరి వద్ద శుక్రవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లో కి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కోడుమూరు నుంచి వెల్దుర్తికి ప్రయాణికులతో వెళుతున్న బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపుతప్పింది. బస్సు పొలాల్లోకి దూసుకుపోయి ఆగింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.