విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రావణమాసం శుక్రవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి కాబట్టి ఈ రోజు విశేషమైన పూజలు నిర్వహిస్తారు.