బొండపల్లి మండలం గెద్దపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించి పేకాడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఆదివారం సాయంత్రం బొండపల్లి ఎస్ ఐ యు మహేష్ తెలిపారు. పేకాడుతో పట్టుబడిన ముగ్గురు వ్యక్తుల నుంచి 13,820 రూపాయలు స్వాధీన పరుచుకుని సీజ్ చేశామని ఈ సందర్భంగా బొండపల్లి ఎస్ ఐ యు మహేష్ పేర్కొన్నారు.