ప్రకాశం జిల్లా గిద్దలూరు లో సెప్టెంబర్ 13వ తేదీన జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని గిద్దలూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భరత్ చంద్ర ప్రజలకు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకునేందుకు ఇదే సరైన వేదిక మార్గమని అన్నారు. లోక్ అదాలత్ లో పరిష్కరించబడ్డ కేసులకు ఎటువంటి అప్పీల్ ఉండదని ఇదే అంతిమ తీర్పు అని న్యాయమూర్తి భరత్ చంద్ర గారు అన్నారు. కక్షిదారులు కట్టిన రుసుము కూడా వెనక్కి ఇప్పించబడునని న్యాయమూర్తి తెలిపారు.