సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి 35 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులకు సూచించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, డిఆర్ఎ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.