కొత్తపేట మండలం ఆవిడిలో బిల్డింగ్ పై నిద్రిస్తున్న పప్పుల ఆనంద్ రాజు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అతడిని వెంటనే అమలాపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని, తక్షణమే ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు.