పల్నాడు జిల్లా,శావల్యాపురం మండలం,కారుమంచి గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన వారు ఊరేగింపులో భాగంగా మరో వర్గంపై దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.