రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని శనివారం మధ్యాహ్నం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచి ఏబీసీడీగా వర్గీకరించాలని కోరారు.