కౌతాళం: భక్తులపై కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ అవుట్ సోర్సింగ్ సిబ్బంది దాడి చేశారు. దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులకు, సిబ్బందికి మాటమాట పెరిగి పిడుగుల వర్షం కురిపించుకున్నారు. అక్కడే ఉన్న కొంతమంది భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. శనివారం ఈ ఘటనపై భక్తులు ఈవో వాణికి ఫిర్యాదు చేశారు. ఈవో స్పందించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.