మునిపల్లి మండలం బుదేరా మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు గదుల నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. రూ. 2.50 కోట్లతో అదనపు గదులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.