44వ జాతీయ రహదారి జప్తి శివునూరు వద్ద వెనుక నుండి లారిని డీ కొట్టిన మరో లారి, డ్రైవర్ కు తీవ్ర గాయాలు నార్సింగి 44వ జాతీయ రహదారి జప్తి శివునూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న ఒక లారీ అతివేగంగా వెళుతూ ముందు వెళ్తున్న మరో లారిని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ అనే లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన 108 సిబ్బంది రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు