Download Now Banner

This browser does not support the video element.

నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

Anantapur Urban, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన కాయల చిన్న పెద్దప్ప అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. ఈనెల 1వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతనిని గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us