మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ హోదా శనివారం ఆయన మాట్లాడుతూ, దేశ పౌరులందరికీ ఏ ప్రాంతంలోనైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. మార్వాడి గో బ్యాక్ నినాదం వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని కానీ బిజెపి మతాలు మరియు కులాల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు.