మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే శుక్రవారం వరద నీటితో ముంపునకు గురైంది. కాజ్వేపై రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపి వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.