జైల్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కలిసిన వారి సతీమణి లిక్కర్ స్కామ్ కేసులో రాజముండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన భార్య లక్ష్మీదివ్యా రెడ్డి గురువారం కలిశారు. ములాఖత్ లో భాగంగా ఆమె ఒక్కరే జైల్లోకి వెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఇటీవల విజయవాడ ఏసీబీ కోర్ట్ మిథున్ రెడ్డికి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.