ప్రభుత్వాలు మారుతున్నా, ప్రజా ప్రతినిధులు మారుతున్నా గిరిజనుల తలరాతలు మారడం లేదు. నేటికీ కనీస మౌలిక వసతులకు లక్ష్మీపురం గ్రామం నోచుకోవడం లేదు. ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామానికి సరైన రోడ్డు లేక సమయానికి వైద్యం అందకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో చిన్న గుడిసెలో చదువు చెబుతున్నామని టీచర్ నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటలకు తెలిపారు.