ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపేందుకు ఏసీబీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నారాయణ స్వామిని సిట్ విచారించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి ఫోన్లో కీలక ఆధారాలు లభిస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.