గుండుగొలను జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించడానికి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన బంధువులను ఆసుపత్రి నిబంధనల ప్రకారం సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. గాయపడినవారిని వెంటనే చూడనివ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.