పాలసముద్రం మండలం, ఎస్. కె పురం పంచాయతీ, తొట్టి కండిగ గ్రామంలో గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు పట్టా భూమిలో ఉన్న దారిని గత నాలుగు రోజులు మునుపు మూసివేశారు. ఈ విషయం తెలుసుకున్న జీడి నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి యుగంధర్ పొన్న ఆదివారం ఆ గ్రామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ తొట్టి కండిగ గ్రామానికి శాశ్వత దారిని ఏర్పాటు చేయాలని సంబంధిత ఎమ్మార్వో ను కోరినట్లు తెలిపారు.