ప్రసిద్ధ ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ క్షేత్రదేవత శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ పరిసరాలను రంగులు, విద్యుత్ దీపతోరణాలతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకోఅలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.