యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. దసరా సెలవుల కారణంగా ప్రజలు సొంత గ్రామాలకు వెళ్తుండడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. 16 బూతులలో 8 బూతులను విజయవాడ వైపు తెరిచి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు టోల్ అధికారులు ప్రయత్నించారు.