నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది .శనివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 589.60 అడుగులుగా ఉందన్నారు. అధికారులు ప్రాజెక్టు 26 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో రెండు లక్షల 59,610 క్యూసెక్కులు ఉండగా అదే స్థాయిలో అవుట్ ప్లో ఉందని జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.