అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని నార్పల మండలం నిలువుతోటపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో దిగుమరి గ్రామానికి చెందిన పెద్దన్న అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.