జగద్గురు వీరబ్రహ్మేంద్రస్వామి వారికి నిప్పుతెచ్చిన శ్రీ కనుమ పోలేరమ్మ ఆలయంలో ఆదివారం రథోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మేనేజర్ ఈశ్వరయ్య చారి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో నిర్వహించిన ఈ ఉత్సవంలో పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.