మంత్రాలయం: నియోజవర్గంలో ఓ మోస్తారు గా వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు నమోదైన వర్షపాత వివరాలను ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వారు విడుదల చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు మంత్రాలయం 51.6 మిల్లీ మీటర్లు, కౌతాళం 8.6 మీల్లి మీటర్లు వర్షపాతం నమోదు అయినట్లు వారు ఓ ప్రకటనలో తెలిపారు.