Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఓయూలో గోడపత్రిక ఆవిష్కరణ

Medchal, Medchal Malkajgiri | Sep 11, 2025
సెప్టెంబర్ 19న ఇందిరాపార్క్ వద్ద జరగనున్న లంబాడీల ఆత్మగౌరవ సభకు తెలంగాణ బంజారా సమాజం ఐక్యంగా తరలిరావాలని ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన విద్యార్థి నాయకుడు గుగులోతు విజయ్ నాయక్ పిలుపునిచ్చారు. ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించే ప్రయత్నాలను తిప్పికొట్టేలా ఈ సభలో ఐక్యతను ప్రదర్శించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో లంబాడీల ఆత్మగౌరవ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us